ఉత్తరప్రదేశ్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు (హవాన్) నిర్వహిస్తున్నారు. రెండు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్గాంధీ నాయకత్వం విజయం సాధించాలని కాంక్షిస్తూ ఢిల్లీలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు. సోనియాగాంధీ, రాహుల్గాంధీ ఫొటోలను పట్టుకుని పూజలు చేస్తున్నారు.