ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీ కలలను రాహుల్ నిజం చేస్తాడు: శ్రీచంద్ కృపలానీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 17, 2017, 04:49 PM

జైపూర్ : జాతిపిత మహాత్మాగాంధీ కన్న కలలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిజం చేయబోతున్నారని రాజస్థాన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీచంద్ కృపలానీ వ్యంగాస్ర్తాలు సంధించారు. స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదని కృపలానీ తెలిపారు. కేవలం స్వాతంత్య్ర ఉద్యమ సంస్థ మాత్రమే అని ఆయన చెప్పారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీజీ జవహర్ లాల్ నెహ్రుకు చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ నెహ్రు.. మహాత్మాగాంధీ మాటను పెడచెవిన పెట్టి.. కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా కొనసాగించారని రాజస్థాన్ మంత్రి తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ.. మహాత్ముడి కలలను నిజం చేయబోతున్నారని ఆయన విమర్శించారు. రాహుల్‌తోనే కాంగ్రెస్ పార్టీ మూసుకుపోతుందన్న కృపలానీ.. బీజేపీకి మంచి ప్రచారకర్త రాహుల్ అని పేర్కొన్నారు. రాహుల్ ప్రచారం వల్లే కాంగ్రెస్‌కు ఒరిగేదేమి లేదన్న ఆయన.. బీజేపీకే అత్యధిక లబ్ధి చేకూరుతుందని కృపలానీ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com