రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు మంత్రి యనమల తూ.గో. జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో హోమియోపతి ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ… నిర్ణీత గడువులోపే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జగన్ పాదయాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. జగన్ హామీలు ఎంత వరకు నెరవేరుస్తారో ప్రజలే ఆలోచించాలన్నారు.