వర్నమెంట్ సర్వీసులంటే ఇప్పటికే వణికిచచ్చే జనానికి ఇక్కడ ఇంకో టెర్రర్ న్యూస్ ! కెపాసిటీకి మించి జనాల్నికుక్కి తీసుకెళ్లే మీ ఎర్రబస్సోళ్లకంటే మేమేం తీసిపోమంటూ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అఫీషియల్ గా ప్రూవ్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. !కరాచీ నుంచి మదీనాకు వెళ్లాల్సిన బోయింగ్ 777 విమానం కెపాసిటీ 409. కానీ.. దిగేటప్పుడు విచిత్రంగా అందులో 416 మంది కనిపించారు.ఈ ఏడుగురు ఎక్స్ ట్రాలు ఎలా పుట్టుకొచ్చారన్నదేగా మీ ప్రశ్న. చార్ట్ రెడీ అయిపోయి.. హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసిన తర్వాత ఏడుమందిని అదనంగా ఎక్కించుకుని.. విమానంలో రెండు వరసలకు మధ్యలో వుండే ఖాళీ స్థలంలో కూర్చోబెట్టేశారు.. సదరు వైమానిక సిబ్బంది. పైసలెన్ని ముట్టాయో తెలీదుగానీ.. అప్పటికప్పుడు ఆ ఏడుగురికీ చేతిరాతతో బోర్డింగ్ పాసులు కూడా ఇచ్చేశారు. జనవరి 20న జరిగిన ఈ మొత్తం తతంగాన్ని పాకిస్థాన్ లోని డాన్ అనే పత్రికలో పూసగుచ్చినట్లు రాసిన తర్వాత మాత్రమే బైటి ప్రపంచానికి తెలిసింది.