న్యూఢిల్లి : బ్యాంకు అకౌంట్లు, మొబైల్ ఫోన్లు, వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేసుకోవడానికి మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ అనుసంధానం తుది గడువును మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలియజేసింది. దానిని ఆమోదించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మధ్యంతర, తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలు, సంక్షేమ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేయడం తప్పనిసరి చేయాలా వద్దా అనే విషయమై కోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. ఈ అంశంపై విచారణను సుప్రీంకోర్టు జనవరి 17వ తేదీన చేపట్టనున్నది.