న్యూఢిల్లీః ఆధార్ను ఇంకా బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డుకు లింకు చేసుకోని వాళ్లకు ఊరట కలిగించే విషయమిది. డిసెంబర్ 31 డెడ్లైన్ను ప్రభుత్వం పొడిగించింది. అయితే కొత్త తేదీని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కు సవరణలు చేసింది. ఈ చట్టంలో ఇప్పటివరకు డిసెంబర్ 31 వరకుగా ఉన్న తేదీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం మరో తేదీ ప్రకటించే వరకు అని సవరణ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ సేవలకు ఆధార్ అనుసంధాన గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి మారుస్తామని ఈ మధ్యే సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆధార్తో మొబైల్ నంబర్ లింకుకు మాత్రం ఫిబ్రవరి 6 చివరి తేదీగా ఉంది. ఇందులో మాత్రం ఏ మార్పూ ఉండదు.