అమరావతి: వైసీపీ నుంచి గెలిచి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైసీపీ నేతలు బుధవారం ఫిర్యాదు చేశారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గిడ్డి ఈశ్వరితోపాటు గతంలో పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపైనా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ రాజ్యాంగ విలువలు పాటించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి స్పీకర్ తొత్తుగా మారారని రామకృష్ణారెడ్డి అన్నారు.