న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై నిప్పులు చెరిగాడు. అమెరికా ప్రజలకు ఒక వర్గం మీడియా ప్రథమ శత్రువు అని పేర్కొన్నాడు. అమెరికాకు మీడియా పెనుముప్పుగా పరిణమించిందని విమర్శించారు. కాన్సాస్ కాల్పులపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. తాను అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిననీ, ప్రపంచానికి కాదనీ పేర్కొన్నాడు. కాన్సాస్ కాల్పుల్లో మరణించిన కూచిభోట్ల శ్రీనివాస్ కు సంతాపం తెలపడానికి నిరాకరించారు. ఇలా ఉండగా కాన్సాస్ కాల్పులకు డోనాల్డ్ ట్రంప్ విధానాలకూ ముడిపెట్టడం బుద్ధితక్కువ అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.