ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు సమస్యలపై మాత్రం మోదీ నోరుమెదపరు: ఒవైసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2017, 03:21 PM

అన్ని అంశాలపైనా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారుగానీ, అసలు సమస్యలపై మాత్రం ఆయన నోరుమెదపరని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి రాజస్థాన్ లవ్ జిహాద్ అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడారు. రాజస్థాన్ లో అఫ్రజుల్ హత్య ఉదంతాన్ని యావత్తు దేశం ఖండించిందని, ఓ మతోన్మాది చేసిన దుశ్చర్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పటికీ మోదీ మాత్రం స్పందించలేదని మండిపడ్డారు. యాభై సంవత్సరాలున్న వ్యక్తి లవ్ జిహార్ కు పాల్పడ్డాడనే ఆరోపణల్లో వాస్తవం లేదని, కేవలం, ముస్లిం అన్న కారణంగానే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com