ఏపీ నిరుద్యోగుల ఎప్పుడెప్పుడా అని చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అమరావతి సచివాలయంలో విడుదల చేశారు. మొత్తం 12, 370 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. హాట్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు మార్చి 9 చివరి తేదీ అని, మార్చి 23, 26 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 9న రాతపరీక్షకు సంబంధించిన కీ విడుదల చేస్తామని, ఏప్రిల్ 10 నుంచి 16 వరకు కీ పై అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. అనంతరం ఫైనల్ కీ ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మే 5న మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని, మే 11న ప్రొవిజనల్ సెలక్షన్ విడుదల చేసి అభ్యర్థులకు సమాచారమిస్తామన్న మంత్రి.. మే 14 నుంచి 19 వరకు ఎంపికైన అభ్యర్థుల ధ్రవపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. 2018 జూన్ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.