పోలవరంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం సంతృప్తిగా లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఎంపీ కేవీపీ రామచంద్రరావు నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీని కలిశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పెరిగే ప్రాజెక్టు వ్యయంపై ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. పునరావాస కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే అన్నారు. కేంద్ర మంత్రి సమాధానం సరిగా లేదని కాంగ్రెస్ నేతలు నితిన్ గడ్కరీ కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు.