అనంతపురం: వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ప్రకటించారు. ఎంపీలు పార్లమెంటులో చేయడానికి ఏమీ లేదన్నారు. ఎంపీలు కరివేపాకుల్లా మారారని, వారిని కనీసం పలకరించే వారే కరువయ్యారని అన్నారు. అనంతపురం నుంచి పోటీ చేసేందుకు తన కుమారుడు ఆసక్తిగా ఉన్నాడని, చంద్రబాబు అనుమతిస్తే తనే అభ్యర్థి అని తెలిపారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్కు ఆయన అన్నే శాపమని జేసీ దివాకర్రెడ్డి అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పొరపాటని అభిప్రాయపడ్డారు. పవన్కల్యాణ్ సినిమాల్లో బాగా కష్టపడి సంపాదించారని, అయితే విత్తనాలు వేస్తే సరిపోదని, పంట పండాలి కదా? అని అన్నారు. తెదేపాలో చేరనున్న గుర్నాథ్రెడ్డి టికెట్ అడగడం లేదని, పార్టీ నేతలెవరైనా సరే చంద్రబాబు నాయకత్వంలో పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒకే నాయకత్వం ఉందన్నారు.