అమరావతి: రాష్ట్రంలో కొందరు పేరుకే వడ్డీ వ్యాపారులని చెప్పుకుంటున్నారని, కానీ వారు చేసేది దారుణాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వడ్డీ వ్యాపారుల ఆగడాలు మరింత పెరిగిపోయాయయన్నారు. చిరు వ్యాపారులు చేసి కుటుంబాన్ని పోషించుకునే వారు వడ్డీ వ్యాపారుల వద్దకి వెళితే వారిని నిలువునా దోపిడి చేస్తున్నారన్నారు. కొంతమంది వ్యాపారులైతే మహిళలను వేధిస్తున్నారని చెప్పారు. మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ పేరుతో చిరు వ్యాపారులను, బడుగు, బలహీన వర్గాల వారిని దోచుకుతింటున్నారన్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం మనీ లెండర్ బిల్లును తీసుకురావడం శుభపరిణామమన్నారు.