అమరావతి : ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు డిసెం బరు 3న దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ మేరకు ఆయన పర్య టన షెడ్యూల్ మంగళవారం ఖరారైం ది. దక్షిణ కొరియాలోమూడు రోజుల పాటు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యట నలో పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు అనేక కొరియా కంపెనీలు ముందుకు వచ్చిన నేపథ్యంలో కొరి యా పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుపై ఈ పర్యటనలో నిర్ణయంతీసుకోనున్నారు.