అమరావతి: తెలుగు భాషను ప్రతిఒక్కరూ కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో తెలుగు భాషపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా తెలుగును కాపాడుకోవాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ఓ కమిటీ వేయడం జరిగిందన్నారు. కమిటీ చైర్మన్గా పల్లె రఘునాథరెడ్డిని నియమించడం జరిగిందన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచే చర్యలు ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆత్మగౌరవంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. ఇంగ్లీష్ను నేర్చుకునే సమయంలో తెలుగును నిర్లక్ష్యం చేయకూడదన్నారు.