తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు.. 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,791 మంది భక్తులు దర్శించుకోగా.. 31,474 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 2.81 కోట్లు.