ప్రధాని నరేంద్ర మోడీ తల నరికేందుకు బీహార్లో అనేకమంది సిద్ధంగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి అన్నారు. ఇక్కడ జరిగిన సభలో రబ్రీదేవి మాట్లాడుతూ మోడీని విమర్శిస్తూ వేలెత్తి చూపితే వేలు నరికేస్తామని, చెయ్యి నరికేస్తామని వారు (బిజెపి) అంటున్నారని, అలా చేస్తే బీహార్ ప్రజలు, దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆమె అన్నారు. మోడీ తల నరకడానికి ఎందరో ఇక్కడ సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు.