పార్టీలు ఫిరాయించడం శిల్పా సోదరులకు వెన్నతో పెట్టిన విద్య అని సోమిశెట్టి విమర్శించారు. గన్మెన్ తొలగింపును రాజకీయం చేయడం వారికి తగదన్నారు. కమిటీ సిఫార్సు మేరకు గన్మెన్ తొలగించారన్నారు. టీడీపీలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పెత్తనం చెలాయించిన శిల్పా చక్రపాణిరెడ్డి.. అప్పట్లో జగన్ దొంగ, దుర్మార్గుడు అని తిట్టారని, అదే నోటితో నేడు జగన్ను పొగడుతూ రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబును నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్రపాణిరెడ్డిపై కక్షసాధింపు దిగాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు బషీర్ అహమ్మద్, పర్వేజ్, నంద్యాల నాగేంద్ర, రవిచౌదరి, పోతురాజు రవికుమార్, హనుమంతరావు చౌదరి, మహేష్గౌడ్ పాల్గొన్నారు.