న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్ష పదవికి షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 1వ తేదీ గడువుగా విధించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీతో పాలు మరో నామినేషన్ వస్తే పోలింగ్ జరగనుంది. లేని పక్షంలో అదే రోజు రాహుల్ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.