నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ కుమారుడు ప్రకాశ్ దహాల్ హృద్రోగ సమస్యతో మృతి చెందారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ప్రకాశ్ దహాల్ (36) ఇవాళ ఉదయం చనిపోయారని ఖాట్మండ్లోని నోర్విక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ప్రకాశ్ దహాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్కు చైర్పర్సన్గా ఉన్నారు. ప్రకాశ్ దహాల్ తన తండ్రి పుష్పకమల్ దహాల్కు వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశారు.