భారత్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్న్లో శ్రీలంక వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. ఐదు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు దిముతు కరుణరత్నె (8; 15 బంతుల్లో 1×4), సమర విక్రమ (23; 22 బంతుల్లో 3×4)ను టీమిండియా పేసర్ భువనేశ్వర్ పెవిలియన్ పంపించాడు.
తొలుత పరుగులిచ్చిన భువి 4.5వ బంతికి కరుణరత్నెను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శ్రీలంక సమీక్షకు వెళ్లినా లాభం లేకపోయింది. ఇక 6.4వ బంతికి వూపుమీదున్న సమరవిక్రమను తన స్వింగ్ మాయాజాలంతో ఔట్ చేశాడు. 8 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 34/2తో ఉంది. ఏంజిలో మాథ్యూస్ (0), తిరుమానె (2) బ్యాటింగ్ చేస్తున్నారు.