కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో 11వ రోజు ప్రజాసంకల్ప యాత్రను నిర్వహించనున్నారు. జగన్ తన 11వ రోజు పాదయాత్రను మరికాసేపట్లో కర్నూలు జిల్లా దొర్నిపాడు నుంచి ప్రారంభించనున్నారు. దొర్నిపాడు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కంపళ్లమెట్ట, ఉయ్యాలవాడ క్రాస్ రోడ్, భీమునిపాడు మీదుగా కోవెలకుంట్ల వరకు కొనసాగనుంది.