కోస్తా ప్రాంతానికి వాయుగుండం ముప్పు తప్పిందని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే... ఈ వాయుగుండం 24 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఒడిశా తీరం దిశగా వాయుగుండం ఉందని, విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్పూర్కు దక్షిణంగా 123 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.