విజయవాడ: సీఎం కుర్చీ కోసం ఎంతకైనా తెగించే ఫ్యాక్షన్ మనస్తత్వం జగన్ది అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జగన్ పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదు... సీఎం కుర్చీ కోసమేనన్నారు. టీడీపీ హయాంలో 24000 కోట్ల రైతు రుణమాఫీ చేశామని, అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీని నెంబర్ వన్గా తిరిచిదిద్దుతుంటే... జగన్ మాత్రం అవినీతిలో నెంబర్ వన్ చేస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. అలాగే జగన్ పాదయాత్ర కాదు పొర్లు దండయాత్ర చేసిన ప్రజలు ఆయన్ను నమ్మరని ఎమ్మెల్యే పేర్కొన్నారు.