కడప: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప కాసేనట్లో ప్రారంభంకానుంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు నివాళులర్పించారు. ఆనంతరం వైఎస్ఆర్ ఘాట్ నుంచి జగన్ ఆయన పాదయాత్రను ప్రారంభించనున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే ఈ పాదయాత్ర.. 125 నియోజకవర్గాల్లో దాదాపుగా 3 వేల కిలోమీటర్లు కొనసాగి.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంతో ముగియనుంది.