ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యూనిచ్‌ నుంచి ముంబయికి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 12:13 AM

ముంబయి : జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా మ్యూనిచ్‌ నుంచి ముంబయికి ఎయి ర్‌బస్‌ ఎ350-900ఎస్‌ను నడపను న్నది. ఏప్రిల్‌ నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది మూడవ అతిపెద్ద ప్రయాణ మార్గమని, ఏప్రిల్‌ 16 నుంచి దీనిని నిర్వహించనున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. లుఫ్తాన్సా ఇప్పటికే ఎయిర్‌బస్‌ ఎ350-900ను న్యూఢిల్లీ నుంచి నడుపుతున్న సంగతి విదితమే. ఇతర విమానాలతో పోలిస్తే ఈ ఎయిర్‌బస్‌ 25 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకోవడమే కాకుండా 25 శాతం తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇందులో మొత్తం 293 మంది ప్రయాణించవచ్చు. 48 బిజినెస్‌ క్లాస్‌, 21 ప్రీమియం ఎకానమీ, 224 ఎకనామీ సీట్లు ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com