ముంబయి : జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా మ్యూనిచ్ నుంచి ముంబయికి ఎయి ర్బస్ ఎ350-900ఎస్ను నడపను న్నది. ఏప్రిల్ నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది మూడవ అతిపెద్ద ప్రయాణ మార్గమని, ఏప్రిల్ 16 నుంచి దీనిని నిర్వహించనున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. లుఫ్తాన్సా ఇప్పటికే ఎయిర్బస్ ఎ350-900ను న్యూఢిల్లీ నుంచి నడుపుతున్న సంగతి విదితమే. ఇతర విమానాలతో పోలిస్తే ఈ ఎయిర్బస్ 25 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకోవడమే కాకుండా 25 శాతం తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇందులో మొత్తం 293 మంది ప్రయాణించవచ్చు. 48 బిజినెస్ క్లాస్, 21 ప్రీమియం ఎకానమీ, 224 ఎకనామీ సీట్లు ఉంటాయి.