తిరుమల: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు. అర్చకులు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అందచేశారు. భక్తులు శ్రీకాంత్ తో సెల్ఫీలు దిగేందుకు ఆశక్తి చూపించారు.