జైపూర్: చిన్నపిల్లల డైపర్లు, శానిటరీ నేప్కిన్లు తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లా నిమ్రానాలో ఉన్న జపనీస్ ఇండస్ట్రియల్ జోన్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలను అదుపు చేసేందుకు రెవరి, బవల్, గురుగ్రామ్ నుంచి సుమారు 15 అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలను అదుపు చేస్తున్నారు. ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు వేగంగా విస్తరించాయని, ముగ్గురు నుంచి నలుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే అధికారిక సమాచారం వెంటనే తెలియలేదు.