నెల్లూరు జిల్లా, వెంకటగిరి పట్టణం, కాలేజిమిట్టకు చెందిన కళాశాల విద్యార్థిని జ్యోతిక పై చెంచుకృష్ణ అనే విద్యార్థి పాల్పడిన దాడిని ఖండిస్తూ అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం స్థానిక కాలేజీమిట్ట లోని మున్సిపాలిటీ సెంటర్ వద్ద స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యురాలు అజిత ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై, విద్యార్థినులపై దాడులలో మద్యం ప్రధాన పోషిస్తుందని, మద్యాన్ని నిషేధించాల్సిన పాలకులు దానిపై పాలన సాగించడం భాధాకరమన్నారు. ప్రేమ పేరుతో వెంటపడి వేధించే సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. నేరం జరిగిన తర్వాత పడే శిక్షలకన్నా నేరం జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని అజిత కోరారు. మరో మహిళా నాయకురాలు వి. రిశిత మాట్లాడుతూ ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మహిళలు త రక్షణ , భద్రత కోసం పోరాటం చేయడం అలవరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టీ విముక్తి సంఘటన సభ్యులు ధనలక్ష్మి, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు.