ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి కొనసాగుతారు.కేంద్ర పరిశీలకులు రాజ్నాథ్ సింగ్, మీంక్షీ లేఖి సమక్షంలో డెహ్రాడూన్లో జరిగిన సమావేశంలో ధామిని సోమవారం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. బీజేపీ ఉత్తరాఖండ్ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రహ్లాద్ జోషి కూడా శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఇంచార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న ఏకైక పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. 70కి 47 సీట్లు బీజేపీ గెలుచుకుంది, ధామీ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఎబివిపిలో చాలా ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేశారు. రెండు పర్యాయాలు ఉత్తరాఖండ్లో బీజేపీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.