గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ కొనసాగుతారని, భారతీయ జనతా పార్టీ (బిజెపి) మార్చి 21, సోమవారం శాసనసభా పక్ష సమావేశం తర్వాత ప్రకటించింది.‘‘వచ్చే ఐదేళ్లపాటు గోవా సీఎంగా పని చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హెచ్ఎం అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గోవా ప్రజలు నన్ను ఆదరించినందుకు సంతోషంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను చేయగలిగినదంతా చేస్తాను" అని సావంత్ అన్నారు.ఈ సమావేశానికి బీజేపీ గోవా ఎన్నికల ఇంచార్జి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు.కాగా, గోవాలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన ప్రమోద్ సావంత్కు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.