తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను ఇటీవల కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దీనిపై తీర్పునిచ్చిన స్పెషల్ బెంచ్ న్యాయమూర్తులకు చంపేస్తామంటూ కొందరు బెదిరించారు. ఈ తరుణంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కోవై రహమతుల్లాను తమిళనాడులోని తిరునెల్వేలిలో అరెస్టు చేయగా, ఎస్. జమాల్ మహ్మద్ ఉస్మానీని తంజార్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమిళనాడు తౌహీద్ జమాత్ సంస్థ (TNTJ) ఆఫీస్ బేరర్లుగా ఉన్నారు. కర్నాటక, తమిళనాడులో నిందితులపై పలు ఫిర్యాదులు రావడంతో అరెస్ట్ చేశారు. గత వారం, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ, న్యాయమూర్తులు కృష్ణ ఎస్.దీక్షిత్, ఖాజీ జైబున్నెసా మొహియుద్దీన్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం హిజాబ్పై తీర్పు ఇచ్చింది. తరగతి గదుల్లో హిజాబ్ ధరించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో అంతర్భాగం కాదని స్పష్టం చేసింది. తమిళనాడులోని పలు సంస్థలు ఈ తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడు కోవై రహమతుల్లా కర్ణాటక న్యాయమూర్తులపై హింసను ప్రేరేపించిన మాట్లాడాడు. జార్ఖండ్లోని ఒక జిల్లా జడ్జిని గతేడాది మార్నింగ్ వాక్కి వెళ్లి, హతమయ్యాడన్నాడు. కర్నాటక ప్రధాన న్యాయమూర్తి ఉదయాన్నే ఎక్కడికి వాకింగ్కు వెళతారో ప్రజలకు తెలుసని నిందితుడు వ్యాఖ్యానించాడు.