ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు: తాలిబాన్ల నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 03:50 PM

బాలికల విద్యాబ్యాసం కోరకు ప్రత్యేక చర్యలు తీసుకొనే దిశగా అప్గన్ లోని తాలిబాన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వ‌చ్చే వారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభిస్తున్నామ‌ని తాలిబన్ ప్ర‌భుత్వ విద్యా మంత్రి అజీజ్ అహ్మ‌ద్ ర‌యాన్ ప్ర‌క‌టించారు. అయితే బాలబాలికలు వేర్వేరు పాఠశాలల్లో చదవాలని తాలిబన్ ప్రభుత్వం షరతు విధించింది. దీనికనుగుణంగా బాలురు, బాలికలకు వేర్వేరు పాఠశాలలు పెడుతున్నట్టు చెప్పారు. అంతేకాదు బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులు మాత్రమే పాఠాలు బోధిస్తారని, ఒక వేళ ఉపాధ్యాయుల కొరత ఉంటే వృద్ధులైన మగ ఉపాధ్యాయులు ఆడపిల్లలకు బోధిస్తారని అజీజ్ అహ్మద్ వెల్లడించారు. ఈ ఏడాది ఏ పాఠశాలలను మూసివేయబోమన్నారు. దీంతో అంతర్జాతీయ వేదికపై తాలిబన్ ప్రభుత్వ ఇమేజ్‌ పెరుగుతుందని అన్నారు. నిజానికి ప్రపంచంలోని చాలా దేశాలు తాలిబన్‌‌ రాజ్యానికి ప్రభుత్వ హోదా ఇవ్వడం లేదు. దానిని ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని మహిళలు, బాలికల విద్య, హక్కుల కోసం అంతర్జాతీయ సమాజం కూడా మాట్లాడుతోంది. తాలిబన్లు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్‌లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయడంతో పాటు, ఆడవాళ్లపై అనేక ఆంక్షలు పెట్టింది. ముఖ్యంగా బురఖా ధరించకుండా మహిళలెవరూ బయటకు రాకూడదని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏ మహిళ ఒంటరిగా బయటకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా, ఆమెతో పాటు మగవాళ్లు ఉండాల్సిందేనని నిబంధన పెట్టింది. ఈ క్రమంలో తాలిబాన్ ప్రభుత్వ పాలనపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com