తెనాలి రైల్వే స్టేషన్ పరిధిలో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారని రైల్వే పోలీసులు తెలిపారు. కొలకలూరు రైల్వే స్టేషన్ వద్ద తాడిశెట్టి వెంకట రమణ (30) అనే వివాహిత ఆత్మహత్య చేసుకోగా తెనాలి మల్లెపాడు గేటు వద్ద షేక్ ఆరిఫ్ (21) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి ఆత్మహత్యలపై వివరాలు తెలియాల్సి ఉందని. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.