కృష్ణా జిల్లా: నూజీవీడు లో శనివారం ఉదయం నుండి ౩౦౦ పోలీసులు పట్టణమును తమ అధీనంలో తీసుకున్నారు ఎక్కడ చూసిన పోలీసులు కనబడుతున్నారు. శాసన సభ్య్లు మేకా వెంకట ప్రతాప అప్పారావు టీడీపీ ఇంచార్జి ముద్దరబోయిన లు ఒకరిపైఒకరు సవాళ్లు విసురుకున్న నేపద్యములో శనివారం పెదగాంధీ బొమ్మ సెంటర్లో సాయంత్రము 4గంటలకు బహిరంగ సదస్సుకు అనుమతి లేదని డీస్పీ బి శ్రీనివాసులు తెలిపినారు. శాసన సభ్యుని ఇంటివద్ద మరియు ముద్దరబోయిన ఇంటివద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నివాసములో లేరు శాసన సభ్యులు ప్రతాప్ అప్పారావు అయన నివాసములో ఉన్నారు. పట్టణము నాలుగు దిక్కులా పోలీస్ పికెట్లు ఏర్పాట్లు చేసినారు సాయంత్రం నాలుగు గంటలవరకు టెన్షన్ వాతావరణము కొనసాగుతుంది.