రాజమండ్రి నగర పరిధిలో ప్రజలను ట్రాఫిక్ అవస్థలనుండి గట్టెక్కించేందుకు ప్రతిపాదించిన మోరoపూడి ఫ్లైఓవర్ మంజూరు, లాలాచెరువు, మోరంపూడి, హుకుంపేట, బొమ్మూరు ల వద్ద సర్వీస్ రోడ్ల పనుల గురించి జాతీయ రహదారుల సంస్థ సంబంధించిన అధికారులని టీడీపీ నాయకులూ బుచ్చయ్య చౌదరి కలవడం జరిగింది. అంతేగాకుండా బొమ్మూరు వద్ద నిర్మిస్తున్న సర్వీస్ రోడ్ ను ధవళేశ్వరం పరిధి వరకు విస్తరించాలని ఆయన కోరారు. అలాగే కడియం మండలం పొట్టిలంక గ్రామం వద్ద వంతెన మంజూరు పురోగతిని పై చర్చించడం జరిగింది. తరచు అనేక ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణము పై తక్షణమే తగు నిర్ణయం తీసుకోవలసిన ఆవశ్యకతను అధికారులకు వివరించడం జరిగింది.