నరసరావుపేట నియోజకవర్గంలో రోజు రోజుకూ వైసీపీకి ప్రజలలో ఆదరణ తగ్గి తెలుగుదేశం పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరగడం తట్టుకోలేని కొన్ని వైసీపీ దుష్ట శక్తులు ఇటువంటి నకిలీ ఫేస్ బుక్ ఐడీలతో ఆయా వర్గాల ప్రజలను కించపరచినట్లుగా పోస్టులు పెట్టడం సిగ్గు చేటు. ఇటువంటి నీచమైన రాజకీయాలు, ప్రజలు గమనిస్తున్నారు?. టీడీపీ పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ వ్యవహారంలో పోలీసులు నిందితులను తక్షణమే విచారణ జరిపి నిజనిజాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు అరవింద్ బాబు తెలియచేసారు.