బంగాల్ లోని అసనోల్ లోక్ సభ, బిహార్ లోని బోచాహన్ శాసనసభ ఉపఎన్నికలతో పాటు.... పలు రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో రాజీనామాతో అసనోల్ లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి టీఎంసీ తరఫున భాజపా మాజీ నేత శత్రుఘ్న సిన్హా బరిలో నిలవగా ఆయనకు పోటీగా భాజపా అగ్నిమిత్ర పాల్ ను బరిలో నిలిపింది. బిహార్ లోని బోచాహాన్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థిగా బేబీ కుమారిని ప్రకటించింది. బిహార్ లో భాజపా మిత్రపక్షమైన వికాస్ శీల్ ఇన్ సాన్ పార్టీ VIP ఎమ్మెల్యే చనిపోవటంతో.. బోచాహాన్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో వికాస్ శీల్ ఇన్ సాన్ పార్టీ భాజపాకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలిపిన నేపథ్యంలో ఈ ఉపఎన్నికల్లో భాజపా తమ అభ్యర్థిని నిలిపింది. అసోం, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపురలో జరగనున్న రాజ్య సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది.