విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయుగుండం ఈ రోజు పూరి-చాందేరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిన్న రాత్రి నుంచి ఏకథాటిగా వర్షం కురుస్తున్నది. సముద్రంలో అల్లకల్లోలంగా ఉంది ఉత్తర కోస్తా వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి.