చిత్తూరు: నిండ్ర మండలం అరూరు గ్రామంలో ఎం ఎస్ ఆర్ బి జి ఎఫ్ నిధులతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ భవన స్థలదాత లేట్ సాల్వా సుందర రామరాజు మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ప్రభుత్వం అందించే పథకాలు లబ్ధిదారులకు పూర్తిగా చేరాలని ఏర్పాటు చేసిన సచివాలయం సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.