అసెంబ్లీ సమావేశాలలో వ్యవసాయం రంగం పై డిమాండ్ చర్చ జరిగింది. ఈ చర్చలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా కిలారి మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం అభివృద్ధి పదంలో ఉందన్నారు. క్షేత్రస్థాయిలో రైతుకు రుణాలు, ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు , పంటలు కొనుగోళ్లు తదితర వాటిని రైతు భరోసా కేంద్రాలలో అమలు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నాయని ఈ సందర్భంగా అన్నారు. 17 వేల రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతుకు విత్తు నాటిన దగ్గర నుండి గిట్టుబాటు ధర ఇస్తూ క్షేత్రస్థాయిలో రైతుకు లాభసాటిగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. గత పాలకుల రైతు పై జాలి చూపించారే కానీ రైతుకు ఉపయోగ పడలేదని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల పై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11. 99 వేల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించ
డం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంతోపాటు విద్య , వైద్యం రంగాలపై ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాల పనితీరును కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలానే సహకార సంఘాల ద్వారా రైతులకు 288 కోట్లు ఇప్పటికే వివిధ పథకాలపై అందించడం జరిగిందని పేర్కొన్నారు.