ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థులకు రూ. 55. 95 కోట్లు లబ్ది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 12:49 PM

జగనన్న విద్యా దీవెన పథకం కింద జిల్లాలో అర్హతగల 91, 779 మంది విద్యార్థులకు రూ. 55. 95 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియను బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లె నుంచి నిర్వహించిన వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. జిల్లా సచివాలయం నుంచి కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ గతేడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద ఈ నగదు జమ అయిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన జిల్లాకు చెందిన విద్యార్థిని హరిప్రియ వీడియో కాన్ఫరెన్సులో సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సురేష్‌, జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ రమ్య, నగర మేయర్‌ అముద, జేసీ (ఆసరా) రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com