చిత్తూరు: రామకుప్పం మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. మండలంలోని పంద్యాలమడుగు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. సభ్యత్వం తీసుకున్నవారికి రెండు లక్షల బీమా సౌకర్యం ఉండటంతో సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తోంది.