ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి

national |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 12:19 PM

మహిళల ప్రపంచకప్‎లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. టీమిండియా నిర్ధేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సునాయాసంగా చేధించింది. ఇంకా 112 బంతులు మిగిలిఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఇంగ్లీష్ జట్టు టార్గెట్‌ను అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా బ్యాటర్లు చెతులెత్తేశారు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ప్రారంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తడబడినట్లు కనిపించిన ఆ తర్వాత కోలుకుంది. కెప్టెన్ హీథర్ నైట్(53 నాటౌట్), నాట్ స్కివర్(45) జోడీ అదుకుంది. మూడు వికెట్‌కు ఈ ద్వయం ఏకంగా 65 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన హీథర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. చివరికి 31.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో మేఘన సింగ్ 3 వికెట్లు తీస్తే.. ఝులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com