అనంతపురం : ఆత్మకూరులో తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం పరుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన భూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయకుండా అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని తీవ్ర మనస్ధాపానికి గురైన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర అస్వస్ధతకు గురైన ఆ మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.