చంద్రబాబు పై మంత్రి అప్పలరాజు ఘాటు వ్యాఖ్యలు చేసారు.బీర్ హెల్త్ డ్రింక్ అని ప్రచారం చేసిన నీచమైన చరిత్ర టీడీపీ పార్టీ ది అని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. 2015లో ఆదాయం పెంచుకునేందుకు అప్పటి సీఎం చంద్రబాబు మద్యాన్ని వాడుకున్నారని, హైవేలపై లిక్కర్ అమ్మవద్దని కేంద్రం చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. మద్యం వినియోగం తగ్గించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.