యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారత వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వదేశంలో తమ విద్య కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. ఉక్రెయిన్ మెడికల్ కాలేజీలతో సమానమైన సిలబస్ ఇక్కడి కాలేజీల్లో రూపొందించి, బోధించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో చాలా మంది హైకోర్టులకు కూడా వెళ్లారు.