ఉత్తరప్రదేశ్: ఆరుషి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్ సోమవారం జైలు నుంచి విడుదల కానున్నారు. గత నాలుగేళ్లుగా వారు దాస్నా జైల్లో ఉన్నారు. వారు మరి కాసేట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. నాలుగురోజుల కిందట తల్వార్ దంపతులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అలహాబాద్ హైకోర్టు విముక్తి కల్పించింది. అయితే ఆర్డర్ కాఫీ ఆలస్యం కావడంతో వారి విడుదలకు జాప్యం జరిగింది. నిన్న సాయంత్రం దాస్నా జైలుకు ఆర్డర్ కాపీ వెళ్లిందని తల్వార్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరుషి తల్లిదండ్రులను 2013లో ఘజియాబాద్ కోర్టు దోషులుగా తేల్చింది. ఆరుషి, హేమరాజ్ జంట హత్య కేసులో వారిద్దరి పాత్ర ఉందన్న సీబీఐ వాదనతో అప్పట్లో కోర్టు ఏకీభవించింది. దీంతో వారిద్దరకు జీవిత ఖైదు ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే తమకు న్యాయం జరగలేదంటూ తల్వార్ దంపతులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వారికి విముక్తి కల్పించింది.