నార్పల మండల కేంద్రానికి చెందిన పరంధామ కుమారుడు సూరి తన దుకాణంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకుని పియం నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. సూరి రెండు రోజుల నుండి ఫోన్ ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి షాపు వద్దకు వచ్చారు. షాపు తెరిచి చూడగా షాప్ లో ఉరి వేసుకుని కనిపించడంతో బోరున విలపించారు. సూరికి గత ఆరు నెలల క్రితం వివాహం అయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెంకటప్రసాద్ తెలియజేశారు.