ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం: అరుణ్ జైట్లీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2017, 10:22 AM

దేశ ప్రజలు మెచ్చుకోవాలని భావిస్తూ వారికి నచ్చే విధంగా విధాన నిర్ణయాలను తాము తీసుకోవడం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సమావేశాల నిమిత్తం అమెరికాలో పర్యటించిన ఆయన, ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను సరైన దిశగా తీసుకు వెళ్లేందుకు సహకరించే అసలైన నిర్ణయాలనే తాము తీసుకుంటున్నామని, సరైన దారిలో నడుస్తున్నామనే భావిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కన్నా, దేశాభివృద్ధే ముఖ్యమని గట్టిగా నమ్మే నరేంద్ర మోదీ వంటి నేత దేశానికి ఓ వరమని అన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కనిపించినా, జీఎస్టీ, నోట్ల రద్దు తదితర కారణాలతో లాభమే అధికంగా జరగనుందని అన్నారు. ప్రపంచమంతా రెండున్నర శాతం వృద్ధికి పరిమితమైన వేళ, ఇండియాలో గత మూడేళ్లుగా 7 నుంచి 8 శాతం వృద్ధిని సాధించిందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఇండియా ముందుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com